Mumbai 26/11 Terror Attack: ముంబై 26/11 దాడులు, లష్కరే తొయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇజ్రాయెల్
ముంబైలో 2008వ సంవత్సరంలో 160 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న 26/11 దాడులు జరిగి 15 ఏళ్ల కావొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది.
- Read in
- తెలుగు
ముంబైలో 2008వ సంవత్సరంలో 160 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న 26/11 దాడులు జరిగి 15 ఏళ్ల కావొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరేకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్ర తీరం గుండా ముంబైలో చొరబడి ముంబైలోని 12 కీలక ప్రాంతాల్లో బాంబుల దాడి సాగించారు. ఈ మారణహోమంలో 18 మంది భద్రతా సిబ్బంది, ఒక ఇజ్రాయెల్ పౌరుడి సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. నాలుగేళ్ల తర్వాత 2012 నవంబర్ 21న కసబ్ను ఉరితీశారు.
Here's ANI Tweet
Embassy of Israel in India says, "To symbolize the marking of the 15th year of commemoration of the Mumbai terror attacks, the state of Israel has listed Lashkar -e- Taiba as a Terror Organization. Despite not being requested by the Government of India to do so, the state of… pic.twitter.com/bME1PVnlQG
— ANI (@ANI) November 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2023 06:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

