Asia Cup 2022: దాయాదుల పోరు రసవత్తరం.. భారత్, పాకిస్తాన్ మధ్య ‘సూపర్–4’ మ్యాచ్ నేడే
భారత్, పాకిస్తాన్ మధ్య ‘సూపర్–4’ మ్యాచ్ నేడే. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో చివరి ఓవర్లో విజయంతో భారత్దే పైచేయి అయింది. రోహిత్ శర్మ సేన అదే జోరును కొనసాగిస్తుందా లేక బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాక్ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానున్నది.
Dubai, September 4: క్రికెట్ అభిమానులకు వరుసగా రెండో ఆదివారం అసలైన సాయంత్రపు వినోదం. దాయాదుల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరమే.. వారం రోజుల వ్యవధిలో భారత్, పాకిస్తాన్ జట్లు రెండోసారి తలపడనున్నాయి. ఆసియా కప్ ‘సూపర్–4’ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సరిహద్దు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేని లోటును తీరుస్తూ టోర్నీలో జరుగుతున్న రెండో రౌండ్ పోరు కూడా అంతే ఆసక్తిని రేపుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో చివరి ఓవర్లో విజయంతో భారత్దే పైచేయి అయింది. రోహిత్ శర్మ సేన అదే జోరును కొనసాగిస్తుందా లేక బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాక్ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానున్నది.
(The above story first appeared on LatestLY on Sep 04, 2022 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

