PRC Report: 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిపార్సు చేసిన కమిటీ, ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి రూ. 10వేల కోట్ల భారం, పీఆర్సీ నివేదికను సీఎం జగన్ కు అందజేసిన కమిటీ

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పీఆర్సీ నివేదికను సీఎస్ కమిటీ (CS Committee Submitted PRC Report) అందజేసింది. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు తదితరులు హాజరై కమిటీ నివేదికను అందజేశారు.

PRC Report: 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిపార్సు చేసిన కమిటీ, ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి రూ. 10వేల కోట్ల భారం, పీఆర్సీ నివేదికను సీఎం జగన్ కు అందజేసిన కమిటీ
CS Committee Submitted PRC Report To CM YS Jagan (Photo-Twitter)

Amaravati, Dec 13: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పీఆర్సీ నివేదికను సీఎస్ కమిటీ (CS Committee Submitted PRC Report) అందజేసింది. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు తదితరులు హాజరై కమిటీ నివేదికను అందజేశారు.

14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్‌ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ (CS Committee) ప్రస్తావించింది. 2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు. 2020-21 నాటికి వ్యయం రూ.67.340 కోట్లు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం. 2020-21 నాటికి 111 శాతానికి చేరుకుంది.ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయంలో 2018-19లో 32 శాతం.. 2020-21 నాటికి 36 శాతానికి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమేనని కమిటీ పేర్కొంది.

రెండు జిల్లాలో తాజాగా జీరో కేసులు నమోదు, ఏపీలో కొత్తగా 108 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు

ముఖ్యమంత్రికి (CM YS Jagan) పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తెలిపారు. అనేక అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి రూ. 10వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్‌ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Dec 13, 2021 08:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).