CM Jagan Memantha Siddham Yatra: రేపటితో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర, 21 రోజులు పాటు 22 జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్, 15 భారీ బహిరంగ సభల్లో ప్రసంగం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధ­వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ముగి­యనుంది

CM Jagan Memantha Siddham Yatra: రేపటితో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర, 21 రోజులు పాటు 22 జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్, 15 భారీ బహిరంగ సభల్లో ప్రసంగం
jagan

Vjy, April 23: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధ­వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ముగి­యనుంది.రేపటి యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు.

ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్‌, పలివలస, నరసన్నపేట క్రాస్‌, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్‌ వద్ద సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్‌ క్యాంప్‌‌ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు.  ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయి,చెల్లూరు మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకోనున్నారు.

సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ గత నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు.ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్‌ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్‌ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు.

(The above story first appeared on LatestLY on Apr 23, 2024 09:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).