Andhra Pradesh: ఎంఎస్‌ఎంఈలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపిన ఏపీ సీఎం

వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 46,119 మందికి ఉపాధి లభించిందని తెలిపారు.

Andhra Pradesh: ఎంఎస్‌ఎంఈలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపిన ఏపీ సీఎం
AP Chief Minister YS Jagan | File Photo

Amaravati, Sep 4: వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 46,119 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయని, వీటిద్వారా 76,916 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కష్టకాలంలో మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటి మీద ఆధారపడిన కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నామని చెప్పారు. 12 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల ( incentives to industries) చేస్తున్నామని చెప్పారు.

18 ఏళ్లలోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,520 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 15 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య

ఎంఎస్‌ఎంఈలకు నేరుగా దాదాపు రూ.450 కోట్లు, టెక్స్‌టైల్‌ మిల్స్‌ వారి ఖాతాల్లోకి మరో రూ.230 కోట్లు వెళ్తాయన్నారు. టెక్స్‌టైల్‌ మిల్లులకు ఇవ్వాల్సిన రూ.450 కోట్ల విద్యుత్‌ చార్జీ రీయింబర్స్‌మెంట్‌ను వారు భవిష్యత్తులో కట్టబోయే కరెంటు బిల్లుల్లో రిబేటు ఇచ్చేలా చేస్తున్నామని స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Sep 04, 2021 01:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).