Andhra Pradesh: రేషన్ కార్డులపై జగన్ ఫోటోలను, వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం, వాటి స్థానంలో పసుపు రంగులో కొత్త కార్డులు ఇచ్చే దిశగా అడుగులు..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ రంగులతో రేషన్ కార్డులను నింపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కార్డులను తొలగించాలని నిర్ణయించింది.

Andhra Pradesh: రేషన్ కార్డులపై జగన్ ఫోటోలను, వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం, వాటి స్థానంలో పసుపు రంగులో కొత్త కార్డులు ఇచ్చే దిశగా అడుగులు..
AP government is removing YSR and Jagan's photos and YCP colors on ration cards

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ రంగులతో రేషన్ కార్డులను నింపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కార్డులను తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అడుగులు వేస్తోంది.

ఏపీ మద్యం పాలసీ, ప్రభుత్వానికి ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం, కొన్ని జిల్లాల్లో దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు

కొత్త కార్డులకు సంబంధించి అధికారులు పలు డిజైన్లను పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్ ను ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా పంపినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా పాత కార్డులపైనే రేషన్ సరుకులను ఇస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Oct 11, 2024 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).