Weather Forecast: సిత్రాంగ్ తుపాన్ విధ్వంసంలోనే మరో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, అక్టోబరు 29 నాటికి శ్రీలంక,తమిళనాడు మధ్యన ఏర్పడనుందని అంచనా

సిత్రంగ్ తుపాను (Cyclone Sitrang) బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడిందన్న వార్త మరువక ముందే.. బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో (Low pressure area) ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.

Weather Forecast: సిత్రాంగ్ తుపాన్ విధ్వంసంలోనే మరో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, అక్టోబరు 29 నాటికి శ్రీలంక,తమిళనాడు మధ్యన ఏర్పడనుందని అంచనా
Heavy Rains (Photo-ANI)

Amaravati, Oct 26: సిత్రంగ్ తుపాను (Cyclone Sitrang) బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడిందన్న వార్త మరువక ముందే.. బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో (Low pressure area) ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.

ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడనుందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అటు, ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి.

ఇక బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

తీరాన్ని తాకిన సిత్రాంగ్ తుఫాన్, బంగ్లాదేశ్‌,పశ్చిమ బెంగాల్‌లో సైక్లోన్ బీభత్సం, గంటకు 100 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు, ఏడుగురు మృతి

దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో విద్యుత్ సరఫారాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 80 లక్షల మంది అంధకారంలోనే ఉండిపోయారు. ఎక్కడికక్కడ చెట్లు, స్తంభాలు నేలకొరిగాయని, బుధవారం వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు తెలిపారు.

వరదల ధాటికి 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 6,000 హెక్టార్ల పంట దెబ్బతింది. వేల చేపల ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే మంగళవారం సాయంత్రం నాటికి తుఫాను తీవ్రత తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. వరదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాన్ కారణంగా సోమవరం తాత్కాలికంగా నిలిపివేసిన విమాన సర్వీసులను 21 గంటల తర్వాత మంగళవారం నుంచి పునరుద్ధరించినట్లు వెల్లడించారు.

డెల్టా ప్రాంతమైన బంగ్లాదేశ్‌లో తరచూ తుఫాన్‌లు, వరదలు సంభవించి 1.6 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగానే గతంతో పోల్చితే అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు, వారికి అత్యవసరాలైన ఆహారం, మందులు, నీళ్లు, టార్పాలిన్లు అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Oct 26, 2022 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).