BRS Office In AP: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది.
Vijayawada, May 19: దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ (TRS) ను బీఆర్ఎస్ (BRS) గా మార్చిన కేసీఆర్ (KCR) ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ (AP) ఏర్పాటు కాబోతోంది. గుంటూరులో (Guntur) ఈ నెల 21న కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం సిద్ధం చేశారు.
ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఆటోనగర్ వద్దనున్న ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనక భాగంలో ఐదంతస్తుల భవనాన్ని కార్యాలయం కోసం తీసుకున్నారు. ఇందులో పార్టీ సమావేశాలకు రెండు ఫ్లోర్లు, మిగిలిన వాటిలో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకులకు కేబిన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?#AndhraPradesh #BRSOffice #Gunturhttps://t.co/LRpzMhxoxN
— TV9 Telugu (@TV9Telugu) May 19, 2023
తెలంగాణ క్యాబినెట్ మరో కీలక నిర్ణయం, కుల వృత్తులు నమ్ముకున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
విజయవాడలో ఏమైంది?
నిజానికి విజయవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించినా అక్కడ అనుకూలమైన భవనం లభించకపోవడంతో గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on May 19, 2023 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

