KCR Tour: మరోసారి రైతుల వద్దకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ లో పర్యటన
క్రమంలోనే ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు.
Hyderabad, March 31: రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్వయంగా రంగంలోకి దిగారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం నూరిపోసేందుకు ఆదివారం నాడు జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో పర్యటించారు (KCR Tour). అక్కడి పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 31, 2024 11:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

