Massage Centre: నెలకు లక్ష జీతం అనగానే సంబురపడింది.. ఫిట్ నెస్ శిక్షకురాలిగా చేరింది.. అయితే, ఉద్యోగంలో కొనసాగాలంటే కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాలన్న యజమాని.. ఆ తర్వాత ఆ మహిళ ఏం చేసింది? హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఘటన
ఉద్యోగంలో కొనసాగాలంటే సెంటర్ కు వచ్చిన పురుష కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాల్సిందేనని అప్పుడే ఉద్యోగంలో చేరిన ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
Hyderabad, Oct 29: ఉద్యోగంలో (Job) కొనసాగాలంటే సెంటర్ కు వచ్చిన పురుష కస్టమర్లకు (Customers) ముద్దులతో (Kisses) పాటు ఇంకా చాలా చేయాల్సిందేనని అప్పుడే ఉద్యోగంలో చేరిన ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఒక మసాజ్ సెంటర్ లో నెలకు రూ. లక్ష వేతనంతో ఫిట్ నెస్ శిక్షకురాలిగా ఇటీవల చేరింది. కస్టమర్లకు మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయాయం చేయించే బాధ్యతలు నిర్వాహకులు ఆమెకు అప్పగించారు. లక్ష రూపాయల వేతనంతో కొలువు లభించడంతో ఆమె ఎంతో సంబురపడింది. అయితే, ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.
బెదిరింపులు మొదలు
కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ వద్దకు వచ్చే పురుష కస్టమర్లు చెప్పినట్టు చేయాలని, ముద్దులు ఇవ్వాలని, ఇంకా ఎన్నెన్నో చేయాలని నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అలా చేస్తేనే ఉద్యోగం ఉంటుందని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 29, 2023 09:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

