HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు?! చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే యోచనలో రాష్ట్ర సర్కారు
సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థకు కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
Hyderabad, Sep 3: సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) (HYDRA) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థకు కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ (AV Ranganath) కు మరో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ గా రంగనాథ్ ను నియమిస్తారని సమాచారం. కాగా, ఇప్పటివరకు ఈ బాధ్యతలను హెచ్ఎండీఏ కమిషనర్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం హైడ్రాను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ కూల్చివేతల్లో కొత్త కోణాన్ని చూపించి రియల్ హీరోగా ఏవీ రంగనాథ్ ఇటీవలి కాలంలో ట్రెండ్ సెట్ చెయ్యడం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ. 5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎందుకంటే?
హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడం ద్వారా ఆక్రమణలకు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ గా రంగనాథ్ ను నియమిస్తారని సమాచారం.
(The above story first appeared on LatestLY on Sep 03, 2024 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

