Case Against Harish Rao Relatives: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే??
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad, Oct 18: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (BRS MLA Harish Rao) బంధువులపై పోలీసు కేసు (Police Case) నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోస్మో హాస్పిటాలిటీ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్ కు పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండానే వారు తన ఇంటిని అమ్మేశారని ఆరోపించారు.
Here's Video:
యజమానికి తెలియకుండా ఇల్లు అమ్మేసిన మాజీ మంత్రి తమ్ముడు, బంధువులు..
మియాపూర్ లోని దండు లచ్చిరాజుకు చెందిన ఐదంతస్తుల భవనంలో బంధువులతో అక్రమంగా ఉంటున్న తన్నీరు గౌతమ్
లచ్చిరాజు ఫిర్యాదుతో తన్నీరు గౌతమ్, జంపన ప్రభావతి, బోయినపల్లి వెంకటేశ్వరరావు, తన్నీరు పద్మజారావు, గారపాటి నాగరవి,… pic.twitter.com/82WOYi5VtH
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2024
ఐదేండ్ల నుంచి పోరుబాట
తన ఆస్తి కోసం 2019 నుంచి పోరాడుతున్నట్లు లచ్చిరాజు వాపోయాడు. లచ్చిరాజు ఫిర్యాదుపై ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on Oct 18, 2024 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

