Fire at BRS Atmiya Sammelan: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు, ఒకరు మృతి, పలువురికి గాయాలు, ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
ఖమ్మంలోని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
Khammam, April 12: ఖమ్మంలోని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు.
కాగా నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు భారీగా బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గుడిసెపై తారాజువ్వ ఎగిరిపడటంతో మంటలు అలుముకున్నాయి. బాణాసంచా ధాటికి గుడిసెలోని గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Here's Video
#BigBreaking ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన #BRSparty
ఆత్మీయ సమ్మేలేనలో అగ్ని ప్రమాదం ఎంపీ నామా ఎమ్మెల్యే రాములు రాకతో బాణసంచా కాల్చిన కార్యకర్తలు నిప్పురవ్వలతో పక్కనే ఉండే పూరి గుడిసెలోకి వ్యాపించిన మంటలు పేలిన సిలెండర్ వ్యక్తి మృతి ++ #khammam pic.twitter.com/VwMHigE6Il
— Tharun Reddy (@KethireddyTarun) April 12, 2023
గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. పేలుడు ధాటికి విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఊహించని ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంపైమంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులను ఆదేశించారు. ఈ మేరకు వారితో ఫోన్లో సంభాషించారు.
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 01:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

