Telangana Horror: సిద్దిపేట జిల్లాలో దారుణం, మహిళ గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేసి దారుణ హత్య
ఇటీవల కాలంలో మానవ మృగాల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లాలో ఓ మహిళను ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది.
ఇటీవల కాలంలో మానవ మృగాల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లాలో ఓ మహిళను ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిని గజ్వేల్ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతి చెందిన మహిళను వెంకటమ్మ (40)గా గుర్తించారు.
వెంకటమ్మ ప్లాస్టిక్ సామగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తుండగా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త గతంలో మృతి చెందారు. అయితే ఇప్పుడు వెంకటమ్మను హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం కూడా సాక్ష్యాలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
(The above story first appeared on LatestLY on Aug 24, 2023 03:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

