Telangana Secretariat: నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభం!

ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Telangana Secretariat: నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభం!
Telangana New Secretariat (Photo-TS CMO)

Hyderabad, Feb 14: ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయ (Telangana New Secretariat) భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారైంది. కేసీఆర్ (KCR) పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Election Code) రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా, ప్రభుత్వం మరో ముహూర్తం ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. పలువురికి గాయాలు

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నూతన సచివాలయ భవనాన్ని  ప్రారంభించాలని నిర్ణయించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్‌సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌లను ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..

(The above story first appeared on LatestLY on Feb 14, 2023 08:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).