Telangana Shocker: భార్యతో వివాహేతర సంబంధం, సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. అతని మర్మాంగాలు కోసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.

Telangana Shocker: భార్యతో వివాహేతర సంబంధం, సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన
Representational Image | (Photo Credits: IANS)

Hyd, Nov 2: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. అతని మర్మాంగాలు కోసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.

మహబూబ్‌ నగర్‌ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌పై గురువారం ఉదయం ఈ హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్‌.. సీఐపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

దారుణం, ఇంట్లోకి దూరి ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన క్లాస్‌మేట్, అడ్డు వచ్చిన బంధువులపై కర్రలతో దాడి

తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్‌ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 02, 2023 01:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).