Pragathi Bhavan: సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పోలీసులు వేధిస్తున్నారని.. సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపిన బాధితుడు
Two People Tried To Commit Suicide at Pragathi Bhavan (Photo-Video Grab)

Hyderabad, June 8: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌కలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి య‌త్నించ‌గా అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయగా అతని సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు.

ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.తన ఇంటి విషయంలో కొంపెల్లి సీఐ మహేశ్ తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు సదరు వ్యక్తి తెలిపాడు. ఈ విషయమై సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సంబంధిత బిల్డర్‌తో పోలీసులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించాడు.

Here's Video 

పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు. బాధితుడి పేరు నర్సింగరావు కాగా, నివాసం మేడ్చల్ దగ్గర కొంపల్లి అని తెలుస్తోంది.