Viveka Murder Case: వివేకా హత్య కేసులో విచారణ జూన్‌ 2కు వాయిదా, సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు హాజరైన గంగిరెడ్డి

మలుపులతో తిరుగుతున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణను జూన్‌ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో విచారణ జూన్‌ 2కు వాయిదా, సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు హాజరైన గంగిరెడ్డి
YS Vivekananda Reddy (Photo Credits: Facebook)

Hyd, April 28: మలుపులతో తిరుగుతున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణను జూన్‌ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో విచారణను జూన్‌కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇక వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్‌ చేయొచ్చని సీబీఐకి తెలిపింది.

వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్‌ రెడ్డి విడుదల చేసిన వీడియో ఇదిగో, పలు ప్రశ్నలను సంధించిన కడప ఎంపీ

అయితే.. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు గంగిరెడ్డి బెయిల్‌ రద్దు అమలులో ఉంటుందని, కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్‌ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్‌ ఇవ్వొచ్చని ట్రయల్‌ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం.

(The above story first appeared on LatestLY on Apr 28, 2023 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).