Sharmila vs Kavitha: వైఎస్ షర్మిల వర్సెస్ కల్వకుంట్ల కవిత, తెలంగాణలో ముదిరిన ట్వీట్ వార్, వీరికి తోడైన బీజేపీ నేతలు
తెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైనాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSR Telangana Rashtra Samithi) నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా ట్విట్టర్లో టీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు
Hyd, Nov 30: తెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైనాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSR Telangana Rashtra Samithi) నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా ట్విట్టర్లో టీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత (TRS Legislator K Kavitha)మధ్య జరిగిన ట్విట్టర్ వాగ్వాదంతో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వంటి ఇతర బీజేపీ నేతలు కూడా తమ ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్లు పలువురి దృష్టిని ఆకర్షించాయి. నిరసన సమయంలో వైఎస్ షర్మిలతో వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. అలాగే రాజకీయ నేతలు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖ ట్వీట్లను ట్యాగ్ చేస్తూ వైఎస్ షర్మిల ట్వీట్లను రీపోస్ట్ చేయడంతో, ఎమ్మెల్సీ కవిత వ్యంగ్య ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీశాయి.
Here's Tweets
అంత తెలంగాణ పౌరురాలు, ఉద్యమ మహిళా నేత , ఇన్ని ఉన్నప్పుడు నిజామాబాద్ కూడా తెలంగాణ లోనే ఉంది కదా మరి ఎందుకు ఓడిపోయారు.... ఓడిపోయాక తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని MLC అయ్యారు.
Edemaina Poetry bale rasaru evaro....
— YS Sharmila (@TeamYSSharmila) November 30, 2022
వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆమె కారు లోపల ఉన్నప్పుడు
ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి.@realyssharmila @PMOIndia @TelanganaDGP
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను (YS Sharmila) పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ కోవర్టు షర్మిల అని విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.
'తాము వదిలిన “బాణం”... తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”' అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. 'పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు' అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.
' అమ్మా.. కమల బాణం... ఇది మా తెలంగాణం... పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం... మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు... నేడు తెలంగాణ రూటు... మీరు కమలం కోవర్టు... ఆరేంజ్ ప్యారేట్టు... మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను... రాజ్యం వచ్చాకే రాలేదు నేను... ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను !' అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.
(The above story first appeared on LatestLY on Nov 30, 2022 11:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

