ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలులో రికార్డుల మోత, నిన్నటి వరకు 5 కోట్లకు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్
గడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.
Mumbai, July 27: గడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ఎక్స్లో పోస్ట్ చేసింది.
We express our gratitude to the taxpayers & tax professionals for helping us reach the milestone of 5 crore Income Tax Returns (ITRs).
Over 5 crore ITRs for AY 2024-25 have already been filed till 26th of July this year as compared to 27th of July last year.
We urge all those… pic.twitter.com/PNPnRQdf44
— Income Tax India (@IncomeTaxIndia) July 26, 2024
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్ (E filing) పోర్టల్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్నుల కోసం పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. గతేడాది మొత్తం 8.61 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి.
(The above story first appeared on LatestLY on Jul 27, 2024 09:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

