Wipro Offers Freshers Lower Pay: ప్రెషర్స్‌కి విప్రో భారీ షాక్, సగం జీతానికే పనిచేయాలని మెయిల్, అందుకు ఓకే అంటే జాబ్‌లో చేరాలని తెలిపిన ఐటీ దిగ్గజం

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్‌ జాప్యం అవుతున్న నేపథ్యంలో ప్రెషర్స్ కు ఐటీ సంస్థ విప్రో భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా నియమించుకున్న ఉద్యోగులను మొదట్లో ఆఫర్‌ చేసిన జీతంలో సగానికి (Wipro Offers Freshers Lower Pay) పనిచేయాలని కోరింది. సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని వారికి మెయిల్ పంపింది.

Wipro Offers Freshers Lower Pay: ప్రెషర్స్‌కి విప్రో భారీ షాక్, సగం జీతానికే పనిచేయాలని మెయిల్, అందుకు ఓకే అంటే జాబ్‌లో చేరాలని తెలిపిన ఐటీ దిగ్గజం
Wipro (Photo Credit: PTI)

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్‌ జాప్యం అవుతున్న నేపథ్యంలో ప్రెషర్స్ కు ఐటీ సంస్థ విప్రో భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా నియమించుకున్న ఉద్యోగులను మొదట్లో ఆఫర్‌  చేసిన జీతంలో సగానికి (Wipro Offers Freshers Lower Pay) పనిచేయాలని కోరింది.

సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని వారికి మెయిల్ పంపింది.  రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్‌ చేస్తారా ( Wipro slashes salaries of fresh recruits) అని యాజమాన్యం ఈ-మెయిల్స్‌ ద్వారా అడిగింది.

ఉద్యోగం ఊడిన వారికి గుడ్ న్యూస్, జాబ్‌ కోల్పోయిన ఉద్యోగుల్ని నియమించుకుంటామని తెలిపిన టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, తమ ఉద్యోగుల్ని తొలగించడం లేదని ప్రకటన

పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్‌లో వివరించింది.

కాగా 2023 బ్యాచ్‌లోని వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ అభ్యర్థులకు కంపెనీ ఈ ఆఫర్ చేసింది.ఇది కూడా ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను బోర్డింగ్‌లోకి తీసుకునే కసరత్తు మార్చి నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కాలం తర్వాత అసెస్‌మెంట్‌లలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్‌లను తొలగించిన నేపథ్యంలో ఈ సగం ఆఫర్‌ విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది.

ఉద్యోగాల కోత షురూ చేసిన HP, 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన పీసీ దిగ్గజం, 2025 చివరి నాటికి దాదాపు 4,000-6,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం

ఆర్థిక మాంద్యం అనిశ్చితి వల్ల విప్రో 2022 బ్యాచ్ గ్రాడ్యుయేట్‌ల కోసం ఆన్‌బోర్డింగ్‌ను చాలా నెలలు ఆలస్యం చేసింది .తాజా గ్రాడ్యుయేట్‌లకు, కంపెనీ రెండు హైరింగ్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది: ఎలైట్, టర్బో. ఎలైట్ అభ్యర్థులకు రూ. 3.5 ఎల్‌పిఎ, టర్బో అభ్యర్థులకు రూ. 6.5 ఎల్‌పిఎ ఆఫర్ చేసింది.

ఉద్యోగులను తొలగించేది లేదంటూనే యాపిల్ షాక్, వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్వాసన, దూసుకొస్తున్న ఆర్థిక మాంధ్య భయాలే కారణం

ఎలైట్ అభ్యర్థులు టర్బోకు అర్హత సాధించాలంటే, వారు తప్పనిసరిగా కంపెనీ వెలాసిటీ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ పొందాలి.రూ. 6.5 LPA ప్యాకేజీతో ఆన్‌బోర్డ్ కోసం వేచి ఉన్న అభ్యర్థులు (ఆగస్టు నుండి ఈ ప్రక్రియ వాయిదా వేయబడిందని వారు చెబుతున్నారు) ఫిబ్రవరి 16న విప్రో నుండి ఒక ఇమెయిల్‌ను అందుకుంది, తక్కువ చెల్లింపు పాత్రను ఎంచుకునే, అలా చేయడానికి ముందుకు వచ్చే వారికి ఫిబ్రవరి 20 వరకు అవకాశం ఇచ్చింది.

(The above story first appeared on LatestLY on Feb 20, 2023 06:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).