Covid in Wuhan: మళ్లీ అక్కడి నుంచే మొదలా, చైనా వుహాన్లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు,కఠిన లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు మినహా అన్నీ మూసివేత
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనావైరస్ మొట్టమొదటగా చైనాలోని వుహాన్లో (Wuhan) బయటపడిన సంగతి విదితమే.కరోనా మూలాలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ వుహాన్లోనే కోవిడ్ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి.
Wuhan, Oct 26: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనావైరస్ మొట్టమొదటగా చైనాలోని వుహాన్లో (Wuhan) బయటపడిన సంగతి విదితమే.కరోనా మూలాలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ వుహాన్లోనే కోవిడ్ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. తాజాగా మళ్లీ అక్కడ (China's Wuhan) కరోనా కేసులు వెలుగు చూడడం కలవరపెడుతోంది. దీంతో వుహాన్లోని పలు జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్ (Lockdown) విధించారు.
సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్లోని హన్యాంగ్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని (partial lockdown as new cases emerge) నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయని.. పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.
ప్రపంచంలోనే తొలిసారి లాక్డౌన్లోకి వెళ్లిన ప్రాంతంగా వుహాన్ నిలిచింది. అటువంటి వుహాన్.. ఏప్రిల్ 2020 నాటికి వైరస్ను నిర్మూలించినట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో మళ్లీ కరోనా కేసులు బయటపడుతున్నాయి. వుహాన్లో 10లక్షల జనాభా కలిగిన జియాంగ్షియా జిల్లాలో ఇటీవల లాక్డౌన్ విధించారు. షాషి ప్రావిన్సులోని డాటొంగ్ నగరంతోపాటు గువాంగ్ఝువాలోనూ కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా హన్యాంగ్లోనూ లాక్డౌన్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇలా వుహాన్తోపాటు చైనాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూనే దానితో కలిసి జీవించే విధానాన్ని ప్రపంచ దేశాలు అవలంబిస్తుండగా.. చైనా మాత్రం జీరో-కొవిడ్ వ్యూహాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు వచ్చినా లక్షల సంఖ్యలో పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు విధిస్తోంది. కఠిన నిబంధనలపై స్వదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నప్పటికీ షి జిన్పింగ్ మాత్రం తమ విధానాన్ని సమర్థించుకుంటున్నారు.
ఏప్రిల్ 2020 నాటికి వైరస్ను నిర్మూలించిన తర్వాత, ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ లాక్డౌన్ను చూసిన నగరంలో జీవితం సాధారణ స్థితికి చేరుకున్న వుహాన్ చాలా కాలం పాటు ఎటువంటి కేసులను చూడలేదు.వుహాన్ శివార్లలో దాదాపు 1 మిలియన్ల మంది ప్రజలు నివసించే జియాంగ్జియా జిల్లాను అధికారులు లాక్ చేయడంతో ఈ సంవత్సరం జూలైలో ఆ స్పెల్ ముగిసింది. తాజాగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
మంగళవారం నాటికి 1,230 కొత్త స్థానిక అంటువ్యాధులు నమోదయ్యాయి, ముందు రోజు 1,068 మరియు రెండు వారాల్లో అత్యధికం. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన స్థావరం అయిన షాంగ్సీ ప్రావిన్స్లోని డాటాంగ్ నగరంలో లాక్డౌన్లు అమలులో ఉన్నాయి. గ్వాంగ్జౌ యొక్క దక్షిణ మహానగరం సోమవారం తన కేంద్రంలోని ఒక జిల్లాలో కోవిడ్ నియంత్రణలను విధించింది.
(The above story first appeared on LatestLY on Oct 26, 2022 04:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

