Nayanthara, Vignesh Shivan: వయనాడ్ విషాదం.. నయనతార, విఘ్నేశ్ దంపతుల దాతృత్వం.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా రూ. 20 లక్షలు అందజేత
కేరళలో వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Wayanad, Aug 3: కేరళలో (Kerala) వయనాడ్ (Wayanad) జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ వంతు సాయంగా రూ.20 లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. కాగా, నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు ఓమన కురియన్, కురియన్ కొడియాట్టు కేరళలోని తిరువల్లలో నివాసం ఉంటున్నారు.
Nayanthara, Vignesh Shivan donate Rs 20 lakh to Wayanad landslide victimshttps://t.co/m4gN5QjhOw
— India Today Showbiz (@Showbiz_IT) August 2, 2024
వీళ్లు కూడా..
ఒక్క నయనతార దంపతులే కాదు.. వయనాడ్ బాధితుల కోసం సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించిన విషయం తెలిసిందే.
మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
(The above story first appeared on LatestLY on Aug 03, 2024 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

