Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
Newdelhi, Nov 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session Starting Today) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాల సందర్భంగా వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఇదేసమయంలో దేశాన్ని కుదిపేసిన మణిపూర్ హింస, ఇటీవల సంచలనం సృష్టించిన గౌతమ్ అదానీ (Adani) అవినీతి చర్యలపై యూఎస్ అరెస్ట్ వారెంట్ జారీ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశమంతా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలి ఎన్నికల బిల్లును లిస్టులో చేర్చకపోయినా దానిని ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్నారు.
26న ప్రసంగించనున్న రాష్ట్రపతి
రాజ్యాంగ ఆమోద 75వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి గుర్తుగా మంగళవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాత పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ లో ప్రసంగిస్తారు.
(The above story first appeared on LatestLY on Nov 25, 2024 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

