Triple Mutation Variant In India: కరోనా మళ్లీ కొత్త అవతారం, దేశంలో ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్ మ్యూటెంట్‌ గుర్తింపు, ఇప్పటికే వణికిస్తున్న డబుల్ మ్యూటెంట్‌

Triple Mutation Variant In India: కరోనా మళ్లీ కొత్త అవతారం, దేశంలో ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్ మ్యూటెంట్‌ గుర్తింపు, ఇప్పటికే వణికిస్తున్న డబుల్ మ్యూటెంట్‌
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

New Delhi, April 21: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.. కాగా దేశంలోనే పుట్టిన డబుల్ మ్యూటెంటే ఈ కరోనా వేగవంత వ్యాప్తికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా ఇంకా దీన్ని ధృవీకరించలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఇంకో కొత్త సవాల్ వచ్చి పడింది. రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ సవాలు విసురుతున్న కరోనా తాజాగా మరో అవతారం ఎత్తింది.

ఇప్పటికే దడపుట్టిస్తున్న డబుల్ మ్యూటెంట్‌కు తోడుగా.. ట్రిపుల్ మ్యూటెంట్ (Triple Mutation Variant In India) వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఉనికిలో ఉన్న మూడు వేరియంట్లలోని కొన్ని లక్షణాలు ఈ ట్రిపుల్ మ్యూటెంట్‌కు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ట్రిపుల్ మ్యూటెంట్ అంటే..మూడు జన్యుమార్పులు ఉన్న వైరస్ అని అర్థం.

మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులకు ఈ ట్రిపుల్ మ్యూటెంట్ కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా తరచూ ఇలా కల్లోలం రేపడానికి ఈ కొత్త వేరియంట్లే కారణమని నిపుణులు భావిస్తున్నారు.

కోవిషీల్డ్‌ టీకా కావాలంటే రూ. 600 చెల్లించాల్సిందే, కోవిషీల్డ్‌ టీకా ధరలను ప్రకటించిన సీరం, నాలుగైదు నెలల్లో రిటైల్‌ స్టోర్లలోనూ అందుబాటులోకి..

కరోనా కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. అనేక మందికి కరోనా వేగంగా సోకుతోంది.’’ అని మెక్‌గిల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ముధుకర్ పాయ్ వ్యాఖ్యానించారు. ‘‘టీకాకు తరచూ మార్పులు చేస్తుండాలి. ఇందుకు కోసం ఈ మహమ్మారిపై లోతైన అవగాహన ఉండాలి’’ అని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయ్ వ్యాఖ్యానించారు. అయితే..భారత్ వంటి దేశాలకు ఇది పెను సవాలని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో కరోనా జన్యుమార్పులను పసిగట్టే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కేవలం ఒక శాతం కేసుల్లో మాత్రమే జరుగుతున్నాయి.

కాబట్టే.. కరోనా డబుల్ మ్యూటెంట్ గుర్తించడంలో ఆలస్యం జరిగి కేసులు విపరీతంగా పెరిగి ఉండొచ్చని డా. పాయ్ అభిప్రాయపడ్డారు. కాగా.. వైరస్ వేగంగా వ్యాపించే కొద్దీ అనేక కొత్త తరాలు పుట్టుకొస్తాయని, ఈ క్రమంలో కొన్ని జన్యుమార్పులు సంతరించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ట్రిపుల్ మ్యుటేషన్ ఎంత ప్రమాదకరమైనది అనేది అధ్యయనాల నుండి మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి, భారతదేశం అంతటా 10 ల్యాబ్‌లు మాత్రమే వైరస్ జన్యు అధ్యయనాలలో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు.

ఏమిటీ ఈ కల్లోలం, ఒక్కరోజులోనే 2,023 మంది కరోనాతో మృతి, కొత్త‌గా 2,95,041 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో మళ్లీ మొదలైన వలస కూలీల కష్టాలు, ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతూ మృతి

డబుల్ మ్యూటాంట్ పెరిగిన ప్రసార రేటును చూపిస్తుంది మరియు పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మరింత తీవ్రమైన వ్యాధికారకతను కలిగి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కొత్తగా వచ్చిన ట్రిపుల్ మ్యుటేషన్ ఆందోళనకరం కన్నా..ఆసక్తికర వైవిధ్యంగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ట్రిపుల్ మ్యుటేషన్‌లోని మూడు వేరియంట్లలో రెండు రోగనిరోధక నుండి తప్పించుకునే ప్రతిస్పందనలను కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి, అనగా అవి శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా ఎదుర్కునే శక్తిని కలిగి ఉంటాయి.  అయితే వ్యాక్సిన్ల ప్రభావంపై ఇంకా ఏమీ తెలియదు. ఏది ఏమైనా కొత్త వేరియంట్ కోవిడ్కు శరీరం సహజంగా పొందిన రోగనిరోధక శక్తి నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Apr 21, 2021 04:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).