Jarkhand Shocker: వైఫ్ తో గొడవ పెట్టుకుంటే నైఫ్ తో చెలాగాటమే, జీన్స్ వేసుకోనివ్వడం లేదని, కట్టుకున్న భర్తను కస కస పొడిచి చంపేసిన భార్య
Image used for representational purpose | (Photo Credits: PTI)

పెళ్లయ్యాక భార్య జీన్స్ వేసుకోకుండా అడ్డుకోవడం భర్తకు కష్టమైంది. భర్త అభ్యంతరం చెప్పడంతో కోపోద్రిక్తురాలైన మహిళ గొడవ పడి, ఆగ్రహంతో ఊగిపోయిన కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన జార్ఖండ్‌లోని జమ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామంలో చోటుచేసుకుంది.

నిందితురాలైన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళను పుష్పగా గుర్తించారు. ఆ మహిళ తనకు జీన్స్  ధరించడం చాలా ఇష్టమని, అయితే ఆమె భర్తకు తాను జీన్స్ ధరించడం ఇష్టం లేదని చెప్పింది.

ఇండియా టుడే కథనం ప్రకారం, శనివారం రాత్రి, ఆమె గోపాల్‌పూర్ గ్రామంలో జీన్స్ ధరించి జాతర చూసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుస్తుల విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో పెళ్లయిన తర్వాత జీన్స్ ఎందుకు ధరించారని భర్త భార్యను నిలదీశాడు.

Weather Forecast: బయటకు రాకండి, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు, రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో తడిసి ముద్దయిన హైదరాబాద్  

భర్త ఆరోపించిన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పుష్ప తన భర్తపై కత్తితో దాడి చేసి  తీవ్రంగా గాయపరిచింది.

బాధితుడైన భర్తను కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ధన్‌బాద్ పీఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు, కానీ అతను మరణించాడు. మృతుడి తండ్రి కర్ణేశ్వర్ మాట్లాడుతూ.. జీన్స్‌ ధరించే విషయంలో తన కొడుకు, కోడలు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఈ గొడవలో భర్తను భార్య కత్తితో పొడిచి చంపిందని చెప్పాడు.

మరోవైపు పోలీసులు విచారణ ప్రారంభించి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘటనపై మాకు సమాచారం అందిందని జమతారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ (ఎస్‌హెచ్‌ఓ) అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ధన్‌బాద్‌లో చికిత్స పొందుతూ బాధితుడు మరణించడంతో ధన్‌బాద్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసు విచారణలో ఉంది.