Musheerabad Fire Accident: ముషీరాబాద్లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో కాలిబూడిదైన 7 కార్లు, మంటల్లో చిక్కుకున్న మారుతీ కార్ల షోరూం, భారీ ఆస్తి నష్టం
తెలంగాణా (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ముషీరాబాద్ వద్ద భారీ అగ్నిప్రమాదం (Musheerabad Fire Accident) చోటు చేసుకుంది. ముషీరాబాద్లోని మారుతి షోరూంలో (Matuthi Show Room) శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 కార్లు కాలిపోయాయి. స్థానికుల సమాచారంలో ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
Hyderabad, February 8: తెలంగాణా (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ముషీరాబాద్ వద్ద భారీ అగ్నిప్రమాదం (Musheerabad Fire Accident) చోటు చేసుకుంది. ముషీరాబాద్లోని మారుతి షోరూంలో (Matuthi Show Room) శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 కార్లు కాలిపోయాయి. స్థానికుల సమాచారంలో ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మంటలు రావడంతో... చుట్టుపక్కల వాళ్లు హడలిపోయారు. ఏం జరిగిందో అంటూ అంతా మారుతీ కార్ల షోరూం వైపు చూశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ కనిపించడంతో ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు.
Here's ANi Tweet
Hyderabad: Fire broke out at a car service centre in Musheerabad area, early morning today; Fire has been doused now. pic.twitter.com/DLFYlBwZDa
— ANI (@ANI) February 8, 2020
వెంటనే అలర్ట్ అయి అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
(The above story first appeared on LatestLY on Feb 08, 2020 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

