Manipur School Bus Accident: మణిపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడిన రెండు స్కూల్ బస్సులు, 15 మంది మృతి, పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అదుపుతప్పి రెండు బస్సులు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్కు చెందిన విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్కు రెండు బస్సుల్లో వెళ్తున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అదుపుతప్పి రెండు బస్సులు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్కు చెందిన విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్కు రెండు బస్సుల్లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో లాంగ్సాయి టుబంగ్ గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిపోయాయి. దీంతో పెను ప్రమాదం జరిగింది.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Dec 21, 2022 03:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

