Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి, ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టిన వ్యాన్, ఘటగావ్ తారిణి ఆలయానికి వెళుతుండగా ఘటన
గురువారం రాత్రి ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఘటగావ్ తారిణి దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వార్తాసంస్థ ఎఎన్ఐ పంచుకుంది.
- Read in
- తెలుగు
గురువారం రాత్రి ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఘటగావ్ తారిణి దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Odisha Road Accident) చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వార్తాసంస్థ ఎఎన్ఐ పంచుకుంది. కియోంజర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ థాకరే తెలిపిన వివరాల ప్రకారం బలిజోడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 20పై ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 12 మందిలో 11 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఒకరు ఘటగావ్ సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. ఘటగావ్ తారిణి ఆలయానికి వెళుతుండగా వ్యాన్ ట్రక్కును ఢీకొట్టిందని వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's ANI Tweets
#WATCH | Ashish Thakare, Keonjhar Collector says, "This incident happened near Ghatagaon on National Highway, 8 people died and 12 injured..." https://t.co/qGSNzXWTzX pic.twitter.com/sfkDM56OEp
— ANI (@ANI) December 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 01, 2023 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

