Rajasthan Shocker: ఆవును ఢీకొట్టిన వందేభారత్, ఆ రైలు ఢీకొట్టిన వేగానికి ఆవు ఎగిరి వృద్ధుడు మీద పడటంతో అతను కూడా మృతి, రాజస్థాన్‌లో విషాదకర ఘటన

దేశంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లలో వందే భారత్‌కు పేరుంది. అయితే ఈ వేగానికి కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల, రాజస్థాన్‌లోని అల్వార్‌లో సెమీ-హై-స్పీడ్ రైలు ఆవును ఢీకొని జంతువును దాదాపు 30 మీటర్ల దూరం గాలిలోకి ఆ ఆవు ఎగరిపడేలా చేసింది.

Rajasthan Shocker: ఆవును ఢీకొట్టిన వందేభారత్, ఆ రైలు ఢీకొట్టిన వేగానికి ఆవు ఎగిరి వృద్ధుడు మీద పడటంతో అతను కూడా మృతి, రాజస్థాన్‌లో విషాదకర ఘటన
Vande Bharat Express (Photo-PTI)

జైపూర్, ఏప్రిల్ 20:  దేశంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లలో వందే భారత్‌కు పేరుంది. అయితే ఈ వేగానికి కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల, రాజస్థాన్‌లోని అల్వార్‌లో సెమీ-హై-స్పీడ్ రైలు ఆవును ఢీకొని జంతువును దాదాపు 30 మీటర్ల దూరం గాలిలోకి ఆ ఆవు ఎగరి పడేలా చేసింది. విషాదకరంగా ఎగిరిన ఆ ఆవు ఓ వృద్ధుడిపై పడటంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

మీడియా కథనాల ప్రకారం మృతుడు శివదయాళ్ శర్మగా గుర్తించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కాళీ మోరీ ఫటాక్‌ సమీపంలోకి విశ్రాంతి తీసుకోవడానికి శర్మ వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రైలు పూర్తి వేగంతో వచ్చి జంతువును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ఆవు గాలిలోకి ఎగిరింది. ఎగిరి కొంచెం దూరంలో ఉన్న బాధితుడిపై పడింది. దీంతో మనిషి, ఆవు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో మరో వ్యక్తి నిలబడి ఉండగా అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

నిన్న బర్రెలు, ఇవాళ ఆవులు, వందేభారత్ ట్రైన్‌కు మరో ప్రమాదం, ఆవు ఢీకొట్టడంతో ముందుభాగం డ్యామేజ్, వందే భారత్ ట్రైన్ క్వాలిటీపై విమర్శలు

దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడు భారతీయ రైల్వేలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి 22 ఏళ్ల క్రితం రిటైరయ్యాడని నివేదికలు తెలిపాయి.

(The above story first appeared on LatestLY on Apr 20, 2023 07:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).