Train Accident in Jharkhand: జార్ఖండ్ లో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 18 బోగీలు.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు
దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరిచిపోకముందే తాజాగా జార్ఖండ్ లో కూడా మరో రైలు ప్రమాదం జరిగింది.
Newdelhi, July 30: దేశంలో వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) కలవరానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరిచిపోకముందే తాజాగా జార్ఖండ్ (Jharkhand) లో కూడా మరో రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని చక్రధర్ పూర్ కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. సుమారు 60 మంది గాయపడినట్టు సమాచారం.
ఖాళీ కడుపుతో ఈ 3 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
18 Coaches Of Mumbai-Bound Train Derails In Jharkhand, 60 Injured.#WWERaw #AsimRiaz #Prabhas #TrainAccident pic.twitter.com/yz8ey1Yz1Q
— News update (@LoverCrick28247) July 30, 2024
అలా ప్రమాదం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్ లను ఢీకొట్టడమే ఈ రైలు ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
(The above story first appeared on LatestLY on Jul 30, 2024 08:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

