Delhi Shocker: ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్, అర్థరాత్రి నిద్రపోతుండగా బెడ్ షీట్లపై పడిన రవ్వలు, ఒక్కసారిగా ఎగసిన మంటలు
దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాస్త్రి పార్క్ (Shastri Park) ఏరియాలోని దోమల నుంచి రక్షణ కోసం ముట్టించిన దోమలబత్తితే మంటలు వ్యాపించాయి. దోమలబత్తీ నుంచి వచ్చిన నిప్పు మిరుగులు బెడ్షీట్లపై పడి ఇళ్లంతా పొగలు వ్యాపించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాస్త్రి పార్క్ (Shastri Park) ఏరియాలోని దోమల నుంచి రక్షణ కోసం ముట్టించిన దోమలబత్తితే మంటలు వ్యాపించాయి. దోమలబత్తీ నుంచి వచ్చిన నిప్పు మిరుగులు బెడ్షీట్లపై పడి ఇళ్లంతా పొగలు వ్యాపించాయి. దాంతో ఊపిరాడక కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు పడుకున్న చోటే మరణించారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
శాస్త్రిపార్క్ ఏరియాలో దోమలబత్తీ అంటుకుని పొగులు కమ్మడంతో ఒకే కుటుంబానికి చెందని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, వాళ్లలో ఒక చిన్నారి ఉందని నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ అదనపు పోలీస్ కమిషనర్ సంధ్యాస్వామి (Additional CP Sandhya Swamy) తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆమె వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
Here's ANI Tweet
Six people including a toddler died & two people are critical due to suffocation as a result of a fire caused due to burning mosquito repellant. Further investigation is underway: Additional DCP Sandhya Swamy at Shastri Park, Delhi pic.twitter.com/7bGw0tlHoQ
— ANI (@ANI) March 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 31, 2023 03:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

