Snake Found in Mid-Day Meal: విద్యార్థులు తిన్న భోజనంలో పాము కలకలం, బెంగాల్‌లో వాంతులతో ఆస్పత్రి పాలైన 30 మంది విద్యార్థులు, పాఠశాలపై దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అ‍స్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలోని మయూరేశ్వర్‌ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల్లో అనూహ్యంగా మధ్యా‍హ్నా భోజనంలో పాము కనిపించినట్లు కలకలం రేగింది. అప్పటికే ఆ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం జరిగింది

Snake Found in Mid-Day Meal: విద్యార్థులు తిన్న భోజనంలో పాము కలకలం, బెంగాల్‌లో వాంతులతో ఆస్పత్రి పాలైన 30 మంది విద్యార్థులు, పాఠశాలపై దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
Snake Found in Mid-Day Meal (Photo-Video Grab)

Bengal, Jan 10: విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అ‍స్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలోని మయూరేశ్వర్‌ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల్లో అనూహ్యంగా మధ్యా‍హ్నా భోజనంలో పాము కనిపించినట్లు కలకలం రేగింది. అప్పటికే ఆ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం జరిగింది.దీంతో వారిని హుటాహుటినా రామ్‌పూర్‌హట్‌ మెడికల్‌​ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

12 ఏళ్లకే గుండెపోటు, నిద్రలోనే ఉలిక్కిపడిలేచి విలవిలలాడిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూత

ఐతే పప్పు నింపిన కంటైనర్‌లో పాము కనిపించినట్లు భోజనం సిద్ధం చేసిన సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. వారిలో ఒక విద్యార్థి మాత్రం ప్రమాదం నుంచి బయటపడి.. డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని ముట్టడించి, అతడి వాహానాన్ని ధ్వసం చేసినట్లు అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 10, 2023 02:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).