Tamil Nadu: ఆంటీ ఇంట్లో బాలికపై తెగబడిన కామాంధులు, తొమ్మది మంది దారుణంగా అత్యాచారం, ఈ దారుణానికి సహకరించిన బాధితురాలి పెద్దమ్మ, నిందితులు అరెస్ట్
తమిళ నాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విల్లుపురం, సెంజి సమీపంలోని ఈ చంకుప్పానికి చెందిన 16 ఏళ్ల బాలికపై బంధువులే సామూహిక లైంగికదాడికి (Nine held for sexually abusing) పాల్పడ్డారు. 80 ఏళ్ల వృద్ధుడితో కలసి బాలికను మరో ఇద్దరు యువకులు కూడా బలాత్కారం (sexually abusing minor girl in Villupuram) చేసినట్లు తెలిసింది.
Chennai, Jan 12: తమిళ నాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విల్లుపురం, సెంజి సమీపంలోని ఈ చంకుప్పానికి చెందిన 16 ఏళ్ల బాలికపై బంధువులే సామూహిక లైంగికదాడికి (Nine held for sexually abusing) పాల్పడ్డారు. 80 ఏళ్ల వృద్ధుడితో కలసి బాలికను మరో ఇద్దరు యువకులు కూడా బలాత్కారం (sexually abusing minor girl in Villupuram) చేసినట్లు తెలిసింది. ఈ కేసులో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటేశన్ పెద్ద కుమారుడు మోహన్, ఇతని స్నేహితుడు ఇళయరాజా తదితరులును పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసు కథనం మేరకు లైంగిక దాడికి గురైన బాలిక పదిహేనేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె కోవైలో ఉన్న శరణాలయంలో ఉంటూ ప్లస్ వన్ చదువుకుంటోంది. సెలవు రోజుల్లో సెంజి సమీపంలో ఉన్న ఈచంకుప్పం ప్రాంతంలోని తన ఆంటీ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన ఆంటీ కుప్పును జింగీ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ (AWPS) అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. గర్భిణిని అబ్జర్వేషన్ హోమ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు
అరెస్టయిన వారిలో మన్నంకట్టి అలియాస్ వెంకటేశన్, 77, ఆర్. ఇళయరాజా, 28, ఎం. వెంకటేశన్, 25, ఆర్. ప్రభు, 37, కె. బాబు, 22, పి. ఎజుమలై, 26, ఎ. సత్యరాజ్, 28 ఉన్నారు. బాలిక బంధువు వయస్సు, 32 కూడా అరెస్టయ్యాడు. 50 సంవత్సరాల వయస్సులో ఆమె పెద్దమ్మ నేరాన్ని ప్రోత్సహించినందుకు. నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఒక పోలీసు అధికారి ప్రకారం, బాలిక తన ఫిర్యాదులో దాదాపు ఏడు నెలల పాటు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొంది. “అమ్మాయి తల్లిదండ్రులు మరణించారు మరియు ఆమె తన 11వ తరగతి పాఠశాల విద్య కోసం జిల్లాలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. మైనర్ బాలికతో పాటు ఆమె పెద్దమ్మ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయగా బాలిక నాలుగు నెలల గర్భిణి అని తేలడంతో నేరం వెలుగులోకి వచ్చింది. "
(The above story first appeared on LatestLY on Jan 12, 2022 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

