Telangana: మార్ఫింగ్ ఫోటోలతో సంపన్నులను బ్లాక్ మెయిల్, వేమలవాడలో కిలేడి హోమ్ గార్డును అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బును గుంజుతూ పోలీసులకు చిక్కింది.హోమ్ గార్డు వడ్ల అనూష వసూళ్ల కోసం మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బును గుంజుతూ పోలీసులకు చిక్కింది.హోమ్ గార్డు వడ్ల అనూష వసూళ్ల కోసం మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్(Dwaraka shekar)ను అనూష బ్లాక్ మెయిల్ చేసింది.
రూ. 3 లక్షల 50 వేలు అప్పుగా తీసుకొని , తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి అతనిని బ్లాక్ మెయిల్ చేసింది. ఈ ఫోటోలతో 5 లక్షల డిమాండ్ చేయగా పరువు పోతుందనే భయంతో ద్వారకా శేఖర్ ఆమెకు ఆ డబ్బును ఇచ్చాడు. అది సరిపోక మరోసారి 3 లక్షలు ఇవ్వాలని అనూష డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది అనూష. ఈకిలేడీ హోంగార్డు బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
lady home guard Anusha blackmailed Rich Persons for money
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు
వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనూష బ్లాక్ మెయిల్ దందాలు
భర్త ఆరోగ్యం బాగలేదంటూ, డబ్బున్న బడా బాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో డిమాండ్
రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర రూ.3,50,000 అప్పుగా తీసుకొని, తిరిగి అడిగితే పెళ్లి… pic.twitter.com/noM8S5xYdT
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
(The above story first appeared on LatestLY on Aug 17, 9715 05:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

