Mumbai Horror: సూట్ కేసులో డెడ్బాడీ గుర్తింపు.. ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో ఘటన.. ఇద్దరి అరెస్టు.. అసలేం జరిగింది?
ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో సినీఫక్కీలో ఓ సూట్ కేసులో పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. డెడ్ బాడీ ఉన్న ఈ సూట్ కేసుతో రైలులో వెళ్లాలనుకున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు.
Mumbai, Aug 6: ముంబైలోని (Mumbai) దాదర్ రైల్వే స్టేషన్ లో సినీఫక్కీలో ఓ సూట్ కేసులో పోలీసులు డెడ్ బాడీని (Dead Body) గుర్తించారు. డెడ్ బాడీ ఉన్న ఈ సూట్ కేసుతో రైలులో వెళ్లాలనుకున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఆ ఇద్దరే ఆ వ్యక్తిని మర్డర్ చేసినట్లు తేలింది. లగేజీ చెకింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో.. ఈ డెడ్ బాడీని పసికట్టారు. బాధితుడిని అర్షద్ అలీ షేక్ గా, ఇద్దరు అనుమానితులను జై ప్రవీణ్ చావ్డా, శివజీత్ సురేంద్ర సింగ్ గా పోలీసులు గుర్తించారు.
Mumbai Man's Body Found In Suitcase At Dadar Railway Station, 2 Arrested https://t.co/9d5lKcA5BR pic.twitter.com/ZUCNot9Y3j
— NDTV (@ndtv) August 6, 2024
ముగ్గురూ మూగవారే
బాధితుడితో పాటు ఇద్దరు నిందితులు కూడా మూగవారే. వాళ్లు ప్రత్యేక భాష ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతారు. దీంతో కేసు విచారణ కోసం నిపుణులను పోలీసులు రప్పించారు. ఓ ఫిమేల్ ఫ్రెండ్ విషయంలో గొడవ జరగడంతో ఆదివారం రాత్రి మర్డర్ జరిగినట్టు విచారణలో తేలింది. డెడ్బాడీని ప్లాస్టిక్ కవర్ లో చుట్టిన నిందితులు సూట్ కేసులో ప్యాక్ చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 06, 2024 10:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

