Vijayasai Reddy Quits Politics: వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని వెల్లడి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

Vijayasai Reddy Quits Politics: వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని వెల్లడి
YSRCP MP Vijaya saireddy (Photo-X)

Vjy, Jan 24: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు.

వీడియో ఇదిగో, నారా లోకేష్ దేశ ప్రధాని కావాలి, డిప్యూటీ సీఎం కాదు, గంటా శ్రీనివాస రావు కొడుకు రవితేజ సంచలన వ్యాఖ్యలు

ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

Here's YSRCP MP Tweet

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

(The above story first appeared on LatestLY on Jan 24, 2025 07:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).