Adipurush; ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు
తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
Hyderabad, June 12: తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా (Pan India) అభిమానులు (Fans) ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై (Adipurush) వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న విడుదల కానుంది. చారిత్రక రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అయితే, రామాయణ పారాయణ జరిగే ప్రతిచోట హనుమంతుడు ఉంటాడన్న నమ్మకంతో ఆదిపురుష్ ప్రదర్వించే ప్రతి థియేటర్లో ఓ సీటును ఖాళీగా ఉంచేందుకు చిత్ర బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ఆదివారం ప్రకటించింది. తమ సొంత డబ్బులతో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాతో పేర్కొన్నారు.
#Adipurush #shreyasgroup to give away 100+ tickets to Every Ramalayam in Every Village of Khammam District, Telangana for free.#AdipurushOnJune16th pic.twitter.com/AWHmrLWw10
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 12, 2023 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

