Mohan Babu: కొవిడ్ వాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న మోహన్ బాబు, అందరూ వ్యాక్సిన్ తీసుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి అంటూ ట్వీట్
ఇటీవల తిరుపతిలో మొదటి డోస్ తీసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్బాబు తాజాగా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. ‘రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయింది.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. కాగా, మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Done with my 2nd dose. I urge everyone to take the vaccine. And wear your mask every time you step out of your home. pic.twitter.com/0cKiWrWg8l
— Mohan Babu M (@themohanbabu) April 25, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2021 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

