Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మూడురోజుల సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్, 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని ఆదేశాలు

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడురోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్‌ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ.. ఐదురోజుల కస్టడీకి కోరింది.

Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మూడురోజుల సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్, 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని ఆదేశాలు
Delhi CM Arvind Kejriwal (photo-ANI

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడురోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్‌ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ.. ఐదురోజుల కస్టడీకి కోరింది. అయితే, కోర్టు మూడురోజులు కస్టడీకి అనుమతించింది. ఆయనను 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. కోర్టులో విచారణ సమయంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ మనీష్‌ సిసోడియాపై తాను వాంగ్మూలం ఇచ్చానని సీబీఐ చెబుతోందని.. ఇందులో వాస్తవం లేదన్నారు. మనీష్‌ సిసోడియా నిర్దోషి అని.. ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం ఎలాంటి తప్పుచేయలేదని.. తాను సైతం నిర్దోషినేనన్నారు.  అరవింద్ కేజ్రీవాల్‌కు పడిపోయిన షుగర్ లెవెల్, టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 26, 2024 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).