Harda Factory Blast: హర్దా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఆర్థిక సాయం
మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పీఎం రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందించనున్నట్లు వెల్లడించారు.
- Read in
- తెలుగు
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని హర్దా (Harda) పట్టణంలో గల ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 90 మందిదాకా గాయపడ్డారు. క్షతగాత్రులు హర్దా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని స్థానిక యంత్రాంగం అందిస్తుందని హామీ ఇచ్చారు. మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పీఎం రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందించనున్నట్లు వెల్లడించారు.
Here's PM Tweet
Distressed by the loss of lives due to the mishap at a cracker factory in Harda, Madhya Pradesh. Condolences to all those who have lost their loved ones. May those injured recover at the earliest. The local administration is assisting all those affected.
Rs. 2 lakh from PMNRF…
— PMO India (@PMOIndia) February 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 06, 2024 05:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

