తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడుగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది.
ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి(అక్టోబర్ 22 బుధవారం) నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Tirumala Receives Heavy Showers Amid Pilgrim Rush
తిరుమలలో కుండపోత వర్షం
తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, బాపట్ల… pic.twitter.com/bMUBLVikKM
— ChotaNews App (@ChotaNewsApp) October 21, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)