సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్యకు (Techie Brutally Killed by miscreants) గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్పై తాత గారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఎందుకు జరిగిందనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Techie Brutally Killed by miscreants in Vizianagaram
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య....
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్పై తాత గారి ఊరు… pic.twitter.com/7bnlVtS3V5
— ChotaNews App (@ChotaNewsApp) February 11, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)