కృష్ణా జిల్లాలో విద్యార్థులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద ఇంటర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు భయాందోళన చెందారు.. అయితే ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తమిళనాడులో బస్సుల పరిస్థితి చూడండి... డోర్ ఓపెన్ అలాగే వెళ్తున్న డ్రైవర్, వైరల్‌గా మారిన వీడియో

Inter students attacked each other on the road in Uyyur

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)