తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వనపర్తి, వికారాబాద్, సూర్యాపేట, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూలు, ములుగు, మహబూబాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.అదే సమయంలో 187 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,68,833 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,917 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,979 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,937కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)