పొరుగుదేశం అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) రెండు రోజులకే మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్‌లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం కాబూల్‌కు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది.

భూ అంతర్భంగాలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.ఈ నెల 27న తఖర్‌ ప్రావిన్స్‌లో, ఈ నెల 22న (గత బుధవారం) హిందూకుష్‌ పర్వతశ్రేణుల్లో వరుస భూకంపాలు సంభవించిన సంగతి విదితమే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడ్డారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)