Andhra Pradesh Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిద్రమత్తులో కల్వర్టును ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు, 22 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది (22 injured in bus accident) గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.

Andhra Pradesh Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిద్రమత్తులో కల్వర్టును ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు, 22 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
Road accident (image use for representational)

Srikakulam, June 20: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది (22 injured in bus accident) గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు విహారయాత్ర కోసం టూరిస్ట్‌ బస్‌లో కేరళకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో దారుణం, భార్యను చంపి శవం పక్కన పడుకున్న భర్త, రాత్రి ఇద్దరూ తప్పతాగిన తర్వాత భోజనం వడ్డింపు సమయంలో గొడవ

రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది వరకు ఉన్నారు. బస్సు నందిగాం మండలం పెద్దతామరాపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టగా.. బస్సు బోల్తా పడింది. ఘటనలో 22 మందికి గాయాలవగా.. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. నందిగాం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 20, 2022 01:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).