AP Shocker: అమ్మాయిలు, ఆంటీలే టార్గెట్, ఫేస్బుక్ ద్వారా అర్థ నగ్నఫోటోలతో బ్లాక్ మెయిల్, ఆ తర్వాత వారిని అనుభవించి డబ్బు, నగలతో పరార్, నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కడప పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడిన ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతిరెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు అరెస్ట్ ( Man wanted in several Theft cases arrested) చేశారు.
YSR Kadapa, August 2: రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడిన ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతిరెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు అరెస్ట్ ( Man wanted in several Theft cases arrested) చేశారు. కడప డీఎస్పీ బూడిద సునీల్ ఆదివారం ఈ అరెస్ట్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసన్నకుమార్ చిన్నవయసులోనే వ్యసనాలకు బానిసయ్యాడు.
బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదవు మానేశాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం 2017లో చైన్స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పుడు ప్రసన్నకుమార్కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్చాట్ ద్వారా 2020 డిసెంబర్లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్రెడ్డి అలియాస్ రాజారెడ్డి అని, హైదరాబాద్లోని సెక్రటేరియట్లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మబలికాడు.
శ్రీనివాసుకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించాలని డబ్బులు కావాలని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బు ఇచ్చింది. తరువాత ప్రశాంత్రెడ్డికి శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇక జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 30 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవి రింగులను దొంగిలించుకుని వెళ్లాడు.
Kadapa Police Tweet
అమ్మాయలు,మహిళలను టార్గెట్ చేసుకుని మాయ మాటలతో లోబర్చుకుని బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న జిల్లాకు చెందిన కేటుగాడిని అరెస్ట్ చేసిన తాలూకా పోలీసులు.
దాదాపు 200మంది అమ్మాయిలు,100మంది మహిళలను మోసగించిన ప్రొద్దుటూరుకి చెందిన ప్రసన్న కుమార్.
రకరకాల పేర్లతో సోషియల్ మీడియాలో అమ్మాయిలకు వల pic.twitter.com/GYjFQfvmBp
— Kadapa Police (@Kadapa_Police) August 1, 2021
ఇతని వద్ద నుండి 1.26 లక్షల రూపాయల నగదు, 30 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం.
సమాచారం వెల్లడించిన కడప డిఎస్పీ సునీల్.#CyberCrime#Dial100#DishaSOS#DishaApp#MahilaPolice#WomenEmpowerment#WomenSafety #GramaSachivalayam#AndhraPradeshPolice#KadapaDistrictPolice
— Kadapa Police (@Kadapa_Police) August 1, 2021
నిందితుడు అల్లరి, చిల్లరగా తిరిగేవాడు. కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించి, వారితో అసభ్యకరరీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వివస్త్ర రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకుంటాడు. తద్వారా వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్పే, ఫోన్ పేల ద్వారా డబ్బులను వసూలు చేసేవాడు. మరికొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సాగా తిరిగేవాడు. ఈ విధంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 సంఖ్యలో మహిళలను మోసగించినట్లు తెలిసింది.
పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్ఐలు ఎస్కెఎం హుసేన్, బి.రామకృష్ణ, హెడ్కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు ఎస్.ఓబులేసు, పులయ్య, ప్రదీప్లను డిఎస్పీ సునీల్ అభినందించారు. ఈ సంఘటనలో నిందితుడి నుంచి రూ.1,26,000 నగదును, 30గ్రాముల బరువున్న బంగారుగాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, నిందితుడి సెల్ఫోన్లను రికవరీ చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 02, 2021 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

