AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ వాసులు ఊపిరిపీల్చుకునే విషయాన్ని వాతావరణశాఖ తెలిపింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.
Vijayawada, Dec 22: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) వాసులు ఊపిరిపీల్చుకునే విషయాన్ని వాతావరణశాఖ తెలిపింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో రేపటి వరకు తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది. అలాగే, వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం ఇంకా అలజడిగానే ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది.
ఇక్కడ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి.
(The above story first appeared on LatestLY on Dec 22, 2024 08:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

