Road Accident In EG: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి.. మృతుల్లో రెండేండ్ల చిన్నారి కూడా..
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Vijayawada, June 12: తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న లారీని (Truck) కారు (Car) ఢీకొట్టడంతో ఆరుగురు మృతి (Six Members Dead) చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హైదరాబాదు నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
🟥హైదరాబాదు నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ కు వెళుతున్న కారు అనంతపల్లి వద్ద ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొంది.
🟥ఒక రెండేళ్ల చిన్నారితో పాటు ఐదుగురు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
🟥 ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంటే ఆసుపత్రికి తరలించారు pic.twitter.com/h1RJl8OQ2U
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 12, 2023
మృతుల్లో రెండేండ్ల చిన్నారి
మృతుల్లో రెండేండ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. గాయపడిన మరో ఇద్దరిని దవాఖానకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Jun 12, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

